← Back to news

అదనపు తరగతి గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే

By Bhasker Mamilla· 4d ago
అదనపు తరగతి గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే

విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదిని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తీగల సునేంద్ర ప్రారంభించారు.

అదనపు తరగతి గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· just now

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.