అదనపు తరగతి గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే

విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదిని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తీగల సునేంద్ర ప్రారంభించారు.




