పిల్లలకు డ్యాన్స్తో పాఠాలు.. టీచర్కు నేషనల్ అవార్డు!

TG: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని MPP గర్ల్స్ ప్రైమరీ స్కూల్ టీచర్ భవానీకి జాతీయ గౌరవం దక్కింది. కేంద్ర విద్యాశాఖ అనౌన్స్ చేసిన నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డుకు సెలెక్ట్ అయ్యారు. దేశంలో ఎంపికైన 48 మందిలో తెలంగాణ నుంచి భవానీ ఒక్కరే కావడం విశేషం. సెప్టెంబర్ 5న దిల్లీలో విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. స్టూడెంట్స్కు ఈజీగా అర్థమయ్యేలా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, డ్యాన్స్ ద్వారా పాఠాలు చెబుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అభినందనలు తెలిపారు.



