← Back to news

సంఘంగా ఏర్పడిన జగదాంబ ఫేస్ టు ప్లాట్ల స్కీమ్ బాధితులు

By Adithya D· 20 Aug 2026
సంఘంగా ఏర్పడిన జగదాంబ ఫేస్ టు ప్లాట్ల స్కీమ్ బాధితులు

TG: డబ్బులు చెల్లించి ప్లాట్లను పొందినా అవి దక్కకపోవడంతో బాధితులంతా సంఘంగా ఏర్పడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లిలో 2013లో జగదాంబ ఫేస్ టు పేరిట ప్లాట్ల స్కీమ్ ఏర్పాటు చేశారు. 6.11 ఎకరాల వెంచర్‌లో వాయిదాల ద్వారా రూ.1.30 లక్షలిచ్చిన వారికి ప్లాట్లు రాసి ఇచ్చారు. గత ఏడాది నుంచి ప్లాట్ల యజమానుల వారసులం అంటూ కొందరు వచ్చి చుట్టూ ప్రహరీ నిర్మించారు. 250 మంది బాధితులు సంఘంగా ఏర్పడి పోరాటం చేస్తున్నారు. మిగతా బాధితులు తమతో కలిసి రావాలని కోరుతూ బోర్డును ఏర్పాటు చేశారు.

More in TG