వర్షం లేక.. మిర్చి, పత్తి కళ్లు తేలేస్తున్నాయ్!

పల్నాడు దాచేపల్లి రైతులకు వర్షమే పెద్ద టెన్షన్గా మారింది. మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. బోర్ల నీళ్లు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో పంటలకు నీరందించడం కష్టంగా మారింది. ఇలాగే కొనసాగితే పంట నాణ్యత దెబ్బతింటుంది. మార్కెట్లో ధర కూడా రాదు. ఇది రైతులకు రెట్టింపు నష్టం! ఎపి మొత్తం ఇదే పరిస్థితి. ఆగస్టు 16 వరకు రాష్ట్రంలో 52% వర్షపాతం లోటు నమోదైంది. దేశవ్యాప్తంగా కూడా 13% లోటే. ఐఎండీ అంచనా ప్రకారం సెప్టెంబర్లోనూ వర్షాలు తగ్గే అవకాశమే ఉంది. మీ ఊళ్లో వర్షాలు, పంటల పరస్థితి ఎలా ఉంది? కామెంట్ చేయండి.



