కల్వకుర్తిలో గంజాయి వ్యాపారి అరెస్ట్!

నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పోలీసులు గంజాయి వ్యాపారంపై ఉక్కుపాదం మోపారు. రంగాపూర్ గ్రామానికి చెందిన ఆలే, సత్యనారాయణ (సత్తి)ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఛత్తీస్గఢ్ లోని సుకుమా ప్రాంతం నుంచి గత మూడేళ్లుగా గంజాయి తెచ్చి, చిన్న ప్యాకెట్లుగా ప్యాక్ చేసి యువతకు అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరెవరైనా ఉంటే వారి కోసం ఆరా తీస్తున్నారు. ఇకపై ఎవరైనా గంజాయి కొనుగోలు, అమ్మకాలు, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.



