UPI దూసుకెళ్తున్నా.. CASHకు తగ్గని డిమాండ్!

దేశంలో UPI, డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నా CASH వాడకం మాత్రం తగ్గడం లేదు. RBI లెక్కల ప్రకారం.. ప్రస్తుతం భారత్లో 176 బిలియన్ కరెన్సీ నోట్లు ఉపయోగంలో ఉన్నాయి. డిజిటల్ సేవలు అందుబాటులో లేని సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో, పొదుపు కోసం చాలామంది నగదుపైనే ఆధారపడుతున్నారు. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నా నగదుకు డిమాండ్ కొనసాగుతోంది.


