జొన్నలరాశి గుట్టలోనే మండలాఫీసులు.. మంత్రికి వినతి

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రానికి నిర్మించనున్న ప్రభుత్వ కార్యాలయాలను స్థానిక జొన్నలరాశి గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలోనే నిర్మించాలని సర్పంచ్ మారం సునీత కోరారు. ఈ మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భవిష్యత్తులో నిర్మించనున్న ఇతర ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇదే స్థలంలో నిర్మించాలని కోరారు.



