నీట్ లీక్పై మోదీ క్షమాపణ చెప్పాలి

TG: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భువనగిరిలో మాట్లాడిన ఆయన, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆరోపించారు. గత 12ఏళ్లలో 152సార్లు పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఇది BJP ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



