పబ్లిక్ గార్డెన్స్ వద్ద ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
హన్మకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఆర్టీసీ బస్సుపై భారీ చెట్టు కూలింది. ఒక్కసారిగా చెట్టు పడటంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో రెండు బైకులు, మూడు ఆటోలు డ్యామేజ్ అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఊపిరి, పీల్చుకున్నారు. చెట్టు కూలడంతో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


