5 నుంచి 9వ తరగతి సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

AP: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 27న స్పాట్ అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు హనుమకొండ డీసీవో సుధాకృష్ణ తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ బాలికల గురుకుల పాఠశాలల్లో ఖాళీలను కమ్యూనిటీ, కుల నిబంధనల ప్రకారం భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన బాలికలు ఈ నెల 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు మడికొండలోని బాలికల గురుకుల పాఠశాలకు హాజరై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


