ప్రైవేట్ టీచర్ల కోసం వెల్ఫేర్ బోర్డు పెట్టాలి

తెలంగాణలో ప్రైవేట్ టీచర్ల కోసం వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం ప్రెసిడెంట్ కుమార్ డిమాండ్ చేశారు. సూర్యాపేట పద్మశాలి భవన్లో జరిగిన టీచర్స్ సన్మాన ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ టీచర్లకు నెలకు 25 వేల సాలరీ ఇస్తూ ESI, PF సౌకర్యాలు ఇవ్వాలన్నారు. సమ్మర్ హాలిడేస్లో 50శాతం సాలరీ ఇవ్వాలని, యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని గవర్నమెంట్ని కోరారు.



