టీచర్ ఉద్యోగాల అమ్మకం.. జగన్ సంచలన ఆరోపణలు!

AP : Sports కోటా పేరుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ పోస్టులను అమ్ముకున్నారని YCP అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తమకు కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికే ప్రత్యేక జీవోలు జారీ చేశామని చంద్రబాబు, లోకేష్ అసెంబ్లీలో ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. పీవీ సింధు పేరు చెప్పి దీన్ని సమర్థించుకుంటున్నారని, కానీ ఉద్యోగాలు అమ్ముకోవడానికే జీవో నెం 4, 47 ఇచ్చారని విమర్శించారు. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ జీవో నెం 23, 56 జారీ చేశారని జగన్ అన్నారు.



