పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. సొంతింటి కల సాకారం

TG: సొంతింటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద ప్రజలకు గొప్ప వరమని మంచిర్యాల 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ అన్నారు. డివిజన్లో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నారని తెలిపారు. పేద కుటుంబాలకు సొంతింటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.



