వ్యాధులపై అలర్ట్.. కలెక్టర్ కీలక ఆదేశాలు

TG: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగుల పరిస్థితిపై ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అవకాశం ఉన్నందున ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.



