తులసినాథం నాయుడుకు ప్రతిష్ఠాత్మక గిడుగు పురస్కారం

AP: తెలుగు భాషకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు పి. తులసినాథం నాయుడుకు ప్రతిష్ఠాత్మక గిడుగు సేవా పురస్కారం లభించింది. విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయ ఆడిటోరియంలో నిర్వహించిన మల్లెతీగ సృజనోత్సవంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు ముని మనవడు గిడుగు వెంకట నాగేశ్వరరావు చేతుల మీదుగా తులసినాథం నాయుడు పురస్కారం స్వీకరించారు. తెలుగు భాష, సాహిత్య రంగానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు.



