OCT 2న చలో చిట్యాల - దళిత సంఘాల పిలుపు

నారాయణపేట జిల్లా, మక్తల్ మండలం, చిట్యాలలో దళిత సంఘాల ఐక్యవేదిక విలేకరుల సమావేశం పెట్టింది. చిట్యాల మాజీ సర్పంచ్, BRS నేత మారుతి గౌడ్ కుమారుడు సత్యం గౌడ్పై ఆరోపణలు వచ్చాయి. దళిత యువతిని మోసం చేసి, పెళ్లి తర్వాత వారంలోనే వదిలేశాడని సంఘాలు ఆరోపించాయి. కులం కారణంగానే ఇలా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమ్మాయినే దోషిగా చూపితే సహించేది లేదని హెచ్చరించారు. అక్టోబర్ 2న చిట్యాలలో నిరసనకు పిలుపునిచ్చారు. అలాగే దళిత అమ్మాయి అని అమ్మాయినే దోషిగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటిని సహించబోమన్నారు.


