తాగునీటి కోసం చెరువులు నింపనున్న అధికారులు

AP: ఐదు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ జవహర్ కాలువ (NSJC)కు 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఆగస్టు 26న నీటి విడుదల ప్రారంభం కానుంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని 442 తాగునీటి చెరువులను ఈ నీటితో నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తాగునీటి కోసం విడుదల చేసిన నీటిని పంటలకు మళ్లించడం లేదా అక్రమంగా తోడటం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాలువ పరిధిలో అక్రమ మోటార్లు, పంపుల వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు.




