ప్రజా సమస్యలను పరిష్కరించండి

గద్వాల మండలంలో ప్రజల ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి డిమాండ్ చేశారు. గద్వాల మండల MRO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ప్రజా సమస్యలపై తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్య, వైద్యరంగ, ఇతర సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో అధ్యయనం చేసినట్టు తెలిపారు. వాటిని సత్వరం పరిష్కరించాలన్నారు.



