చెత్త నుంచి డబ్బు.. NTPC చైతన్య కార్యక్రమం!

రామగుండం టౌన్షిప్లో ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. NTPC పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో "వేస్ట్ టు వాల్యూ" – అంటే వ్యర్థాల నుంచి ఆదాయం అనే అవగాహన సెషన్ నిర్వహించారు. చెత్తను తడి, పొడి, పునర్వినియోగ వ్యర్థాలుగా వేరు చేయడం, సురక్షితంగా సేకరించడం, శాస్త్రీయంగా తరలించడం – ఇవన్నీ ఈ సెషన్ లో కవర్ చేశారు. టౌన్షిప్ నివాసితులు కాగితం, అట్టపెట్టెలు, ప్లాస్టిక్, ఇనుము, గాజు వంటి వాటిని తీసుకొచ్చి అందజేశారు. చెత్తలో కూడా డబ్బు ఉంటుందని, పర్యావరణానికి మేలు చేస్తూ ఆదాయం సంపాదించొచ్చని అధికారులు వివరించారు.



