← Back to news

చెత్త నుంచి డబ్బు.. NTPC చైతన్య కార్యక్రమం!

By KS· 4d ago· Ramagundam, Ramagundam, Peddapalli
చెత్త నుంచి డబ్బు.. NTPC చైతన్య కార్యక్రమం!

రామగుండం టౌన్‌షిప్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. NTPC పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో "వేస్ట్ టు వాల్యూ" – అంటే వ్యర్థాల నుంచి ఆదాయం అనే అవగాహన సెషన్ నిర్వహించారు. చెత్తను తడి, పొడి, పునర్వినియోగ వ్యర్థాలుగా వేరు చేయడం, సురక్షితంగా సేకరించడం, శాస్త్రీయంగా తరలించడం – ఇవన్నీ ఈ సెషన్ లో కవర్ చేశారు. టౌన్‌షిప్ నివాసితులు కాగితం, అట్టపెట్టెలు, ప్లాస్టిక్, ఇనుము, గాజు వంటి వాటిని తీసుకొచ్చి అందజేశారు. చెత్తలో కూడా డబ్బు ఉంటుందని, పర్యావరణానికి మేలు చేస్తూ ఆదాయం సంపాదించొచ్చని అధికారులు వివరించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· just now

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.