230 మంది విద్యార్థులు..మూడే తరగతులు
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కరీముఖిపుట్ ZPHSలో సుమారు 230 మంది విద్యార్థులున్నారు. వాళ్లందరికీ కలిపి మూడే తరగతుల్లో పాఠాలు చెప్తున్నారు. వీటికి పైకప్పు సరిగా లేదు. ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో తరగతుల్లోకి నీరు చేరి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. టీచర్లు సైతం ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మరిన్ని తరగుతులు నిర్మించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.



