← Back to news

రూ.19.35 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

By Ramprasad· 22 Aug 2026
రూ.19.35 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 353 మందికి రూ.3.44 కోట్ల మేర వైద్య ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు.ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం 18 రీయింబర్స్‌మెంట్, 2 ఎల్‌ఓసీలకు సంబంధించిన మొత్తం రూ.19,35,426 విలువైన చెక్కులను ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గం నుంచి సీఎంఓ కార్యాలయానికి పంపిన 500 దరఖాస్తుల్లో మిగిలిన 147 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.

రూ.19.35 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

More in Local