రూ.19.35 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 353 మందికి రూ.3.44 కోట్ల మేర వైద్య ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు.ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం 18 రీయింబర్స్మెంట్, 2 ఎల్ఓసీలకు సంబంధించిన మొత్తం రూ.19,35,426 విలువైన చెక్కులను ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గం నుంచి సీఎంఓ కార్యాలయానికి పంపిన 500 దరఖాస్తుల్లో మిగిలిన 147 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.




