ఆఫీస్ అపరిశుభ్రం.. టాయిలెట్లు క్లీన్ చేసిన మంత్రి జూపల్లి!
TG: నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి తహసీల్దార్ ఆఫీస్ను మంత్రి జూపల్లి కృష్ణారావు సడన్గా విసిట్ చేశారు. ఆఫీస్లోని టాయిలెట్లు చాలా డర్టీగా ఉండటం, పబ్లిక్ ఫైల్స్ క్లియరెన్స్లో బాగా ఆలస్యం జరగడంపై అధికారులు, స్టాఫ్పై ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా మంత్రితో పాటు కలెక్టర్ స్వయంగా టాయిలెట్లను వాటర్తో క్లీన్ చేశారు. పబ్లిక్ వర్క్స్ విషయంలో అస్సలు కేర్లెస్గా ఉండొద్దని, డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన యాక్షన్ తప్పదని ఆఫీసర్లకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు.



