వకుళమాత అన్నదాన భవన ప్రారంభం

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.6.25 కోట్ల సిజిఎఫ్ నిధులతో నిర్మించిన వకుళమాత అన్నదాన భవన నిర్మాణాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. తిరుమల తరహాలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్న పుణ్యక్షేత్రం వాడపల్లి అని అన్నారు. కార్యక్రమంలో JSP ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావు, బీజేపీ నేత పాలూరి సత్యానందం, చైర్మన్ ముదునూరి వెంకటరాజు పాల్గొన్నారు.




