← Back to news

వకుళమాత అన్నదాన భవన ప్రారంభం

By arjun banu· 5d ago· Atreyapuram, Atreyapuram, Dr. B.R. Ambedkar Konaseema
వకుళమాత అన్నదాన భవన ప్రారంభం

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.6.25 కోట్ల సిజిఎఫ్ నిధులతో నిర్మించిన వకుళమాత అన్నదాన భవన నిర్మాణాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. తిరుమల తరహాలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్న పుణ్యక్షేత్రం వాడపల్లి అని అన్నారు. కార్యక్రమంలో JSP ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావు, బీజేపీ నేత పాలూరి సత్యానందం, చైర్మన్ ముదునూరి వెంకటరాజు పాల్గొన్నారు.

వకుళమాత అన్నదాన భవన ప్రారంభం

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.