అందుకే మాట్లాడలేకపోయాను: మమతా బెనర్జీ
తన వెహికల్ పై రాళ్లతో ఎటాక్ జరగడంతో తీవ్రమైన చెస్ట్ పెయిన్ వచ్చిందని, రెండు రోజుల పాటు అసలు మాట్లాడలేకపోయానని పశ్చిమ బెంగాల్ మాజీ CM మమతా బెనర్జీ తెలిపారు. ఆ దాడిలో తన కళ్లద్దాలు కూడా పగిలిపోయాయని చెప్పారు. పోలీసులు ఎవరిని అరెస్ట్ చేసినా చేయకపోయినా అది వారి డ్యూటీ అని, కానీ తమ పార్టీ వర్కర్స్పై అటాక్స్ చేస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. తాము పీస్ నే కోరుకుంటున్నామని ఆమె మీడియాతో చెప్పారు.


