గ్లోబరీనా KTR బినామీ కంపెనీ: CM

TG: వివాదాస్పద గ్లోబరీనా కంపెనీ KTR బినామీ సంస్థ అని CM రేవంత్రెడ్డి ఆరోపించారు. కంపెనీతో కేటీఆర్కు సంబంధం లేకుంటే సీసీఎస్లో ఫిర్యాదు చేసి విచారణ కోరాలని సవాల్ విసిరారు. BRS హయాంలో గ్లోబరీనా సంస్థకు ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకన కాంట్రాక్టు అక్రమంగా అప్పగించారని, ఆ సంస్థ తప్పిదాల వల్ల 2019లో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. విజిలెన్స్ విచారణ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై KTR క్షమాపణలు చెప్పాలన్నారు.



