← Back to news

ఓనం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

By Shankar Soudarpally· 24 Aug 2026
ఓనం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

TG: మినీ ఇండియాగా పేరొందిన పటాన్‌చెరు నియోజకవర్గం విభిన్న సంస్కృతులకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్‌లోని ఎస్‌ఎన్‌ గార్డెన్స్‌లో కేరళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల పండుగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి వర్గం అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

ఓనం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
ఓనం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

More in Local