← Back to news

పరకాలలో DS పార్టీ ఆందోళన.. ₹14,000 కోట్లు కావాలి!

By prabhakar· 3d ago· Parkal, Parkal, Hanumakonda
పరకాలలో DS పార్టీ ఆందోళన.. ₹14,000 కోట్లు కావాలి!

హన్మకొండ జిల్లా పరకాలలో ధర్మ సమాజ్ పార్టీ (DSP) నాయకులు ఆందోళనకు దిగారు. మంగళవారం తహసీల్దార్ విజయలక్ష్మి గారికి వినతిపత్రం అందజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ₹14,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా DSP నేత బొచ్చు, నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది విద్యార్థుల నిధులు పెండింగ్ లో ఉండటం బాధాకరమన్నారు.ప్రభుత్వం ఫీజులు సకాలంలో చెల్లించకపోవడంతో BC, SC, ST నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.