పలమనేరులో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’

AP : చిత్తూరు జిల్లాలో పలమనేరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’లో భాగంగా శనివారం పారిశుధ్య పనులు చేశారు. మున్సిపల్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, ప్రజలతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. అన్ని వార్డుల్లో శుభ్రత, ఫాగింగ్, బ్లీచింగ్, డ్రైనేజీ పూడికతీత పనులు పూర్తి చేశామని మున్సిపల్ మేనేజర్ ఖాదర్ మొహిద్దీన్ తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.




