📱 అంగన్వాడీలకు డిజిటల్ పాఠాలు

AP : కాకినాడ జిల్లా శంఖవరంలో అంగన్వాడీ సిబ్బందికి 6 రోజులుగా జరుగుతున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఆఖరి రోజున వాట్సాప్, SMS లాంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లు ఎలా వాడాలో, డిజిటల్ కంటెంట్తో పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలో వివరించారు. అలాగే పిల్లల డెవలప్మెంట్ను చెక్ చేయడం, వారిలోని లోపాలను గుర్తించి పేరెంట్స్కి సరిగ్గా ఎలా ఎక్స్ప్లేన్ చేయాలో ట్రైనింగ్ ఇచ్చారు. నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు చేయాలని నిర్ణయించారు.



