CJP నిరసనలకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల సపోర్ట్

NEET పేపర్ లీక్ వ్యవహారంపై దర్శకుడు శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి భరోసా కల్పించాలని కోరారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉందని, ప్రభుత్వం వారి గొంతు వినాలని అన్నారు. చివరగా Gen Z యువత చేస్తున్న ఉద్యమానికి సెల్యూట్ చేస్తూ 'మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టే' అని వ్యాఖ్యానించారు.



