← Back to news

రైతులకు అండగా ఉంటాం: సబితా ఇంద్రారెడ్డి

By DK· 19 Jul 2026· రంగారెడ్డి జిల్లా

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, BRS నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కలిశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో తమ సాగుభూములను బలవంతంగా తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా రైతులు తమ భూములను రక్షించాలని వేడుకున్నారు. రైతుల సమస్యలను విన్న ఆమె, భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు BRS పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ఫైరయ్యారు.

More in Politics