ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం

AP : మందస మండలం జిల్లుండ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తన రెక్కల కష్టంతో భార్యను, దివ్యాంగుడైన కొడుకును పోషిస్తున్న 35 ఏళ్ల రైతు తిరుపతిరావు పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయారు. 108 సిబ్బంది వచ్చి పరీక్షించేసరికి ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి ఆధారమైన వ్యక్తి ఉన్నట్టుండి దూరమవ్వడంతో భార్య, దివ్యాంగ కుమారుడి భవిష్యత్తు ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. ఆ పేద కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఊరి ప్రజలంతా కోరుతున్నారు.



