← Back to news

హాడ్గావ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. కుంటలోనే చెత్త పారవేత

By Md Jabeer· 22 Aug 2026

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హాడ్గావ్‌లో పరిశుభ్రతపై అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా, గ్రామ సమీపంలోని కుంటలో పారబోస్తున్నారు. ఇది పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. చెత్త కుంటలో పడటంతో దుర్వాసన, పరిశుభ్రత సమస్యలు తీవ్రమయ్యాయి. స్థానిక సమస్యలను ఎంపీఓ పర్యవేక్షించకపోవడం, రికార్డులను తనిఖీ చేయకపోవడమే ఇందుకు కారణమని ప్రజలు మండిపడుతున్నారు. బాధ్యతారహితంగా ఉన్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

More in Local