పేదవాడి ప్రాణానికి విలువ లేదా?
తిరుపతి ఆటోనగర్కు చెందిన శ్రీనివాసులు (55) అనారోగ్యంగా ఉండడంతో మంగళవారం రాత్రి 9:30 గంటలకు రుయా హాస్పిటల్ తీసుకొచ్చారు. బెడ్లు ఖాళీ లేవని చెప్పి అరగంట బయటే ఉంచడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ సెక్యూరిటీ, సిబ్బంది నిర్లక్ష్యమే ఈ మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.



