ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపే నిర్ణయం!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే తమ డిమాండ్పై ప్రభుత్వంతో చర్చలు జరిగాయని, దీనిపై రేపు మధ్యాహ్నం వరకు ప్రభుత్వం సమయం అడిగిందని CJP స్పోక్స్ పర్సన్ అశుతోష్ రంకా తెలిపారు. విద్యాశాఖ మంత్రిని త్వరలోనే తొలగిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే నీట్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడిన అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం అందించడం, విద్యార్థులపై నమోదైన FIRలు, కేసులను ఉపసంహరించుకోవడం అనే రెండు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన స్పష్టం చేశారు.



