హల్ద్వానీ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

TG: ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముధోల్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేతలు పోలీసులను కోరారు. నిర్మల్ జిల్లా ముధోల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైకి ఎస్సీ సెల్ అధ్యక్షుడు జోందలే నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ముగిసిన అనంతరం హల్ద్వానీలోని రామలీలా మైదానాన్ని కొందరు శుద్ధీకరణ చేశారన్న ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.



