← Back to news

హల్ద్వానీ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

By Nani Gaini· 3d ago· Nirmal
హల్ద్వానీ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

TG: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముధోల్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేతలు పోలీసులను కోరారు. నిర్మల్ జిల్లా ముధోల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైకి ఎస్సీ సెల్ అధ్యక్షుడు జోందలే నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ముగిసిన అనంతరం హల్ద్వానీలోని రామలీలా మైదానాన్ని కొందరు శుద్ధీకరణ చేశారన్న ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.