మూగజీవాలకు టీకాలు వేయండి మహాప్రభో

ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలంలో పశువుల ఆరోగ్యం ప్రధాన ఇష్యూ అయ్యింది. వానాకాలం వస్తోంది కాబట్టి, గొర్రెలకు, మేకలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. పాత కుప్పనగుంట్లలో ఈ మేరకు జరిగిన సమావేశంలో జీఎంపీఎస్ ఖమ్సం జిల్లా నాయకుడు మాట్లాడుతూ "పశుసంవర్ధక శాఖ వెంటనే ముందుకు రావాలి. వ్యాధులు రాకుండా టీకాలు, నులిపురుగుల మందులు ఉచితంగా ఇవ్వాలి. ప్రతి గ్రామంలో పశువైద్య శిబిరాలు పెట్టాలి.<br>పశువులు చనిపోతే రైతులకు పరిహారం ఇవ్వాలని" అని డిమాండ్ చేశారు. మీ ఊళ్లో ఉన్న గొర్రెలకు, మేకలకు టీకాలు వేశారా? కామెంట్ చేయండి.



