← Back to news

మూగజీవాలకు టీకాలు వేయండి మహాప్రభో

By citu &DYFI malluru chandra shekar Malluru· 3d ago· Kuppenakuntla, Penuballi, Khammam
మూగజీవాలకు టీకాలు వేయండి మహాప్రభో

ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలంలో పశువుల ఆరోగ్యం ప్రధాన ఇష్యూ అయ్యింది. వానాకాలం వస్తోంది కాబట్టి, గొర్రెలకు, మేకలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. పాత కుప్పనగుంట్లలో ఈ మేరకు జరిగిన సమావేశంలో జీఎంపీఎస్ ఖమ్సం జిల్లా నాయకుడు మాట్లాడుతూ "పశుసంవర్ధక శాఖ వెంటనే ముందుకు రావాలి. వ్యాధులు రాకుండా టీకాలు, నులిపురుగుల మందులు ఉచితంగా ఇవ్వాలి. ప్రతి గ్రామంలో పశువైద్య శిబిరాలు పెట్టాలి.<br>పశువులు చనిపోతే రైతులకు పరిహారం ఇవ్వాలని" అని డిమాండ్ చేశారు. మీ ఊళ్లో ఉన్న గొర్రెలకు, మేకలకు టీకాలు వేశారా? కామెంట్ చేయండి.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.