సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే
నాగర్కర్నూలు జిల్లా పదర మండలం మాడుగు గ్రామంలో సీతారామాంజనేయ స్వామి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.



