ఫ్యూచర్ సిటీలో డిఫెన్స్ ఎక్స్పో: CM రేవంత్రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’కు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను CM రేవంత్రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో రాజ్నాథ్సింగ్ను కలిసిన CM.. డిసెంబరు 7 నుంచి 9 వరకు రంగారెడ్డి జిల్లాలోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే సదస్సులో పాల్గొనాలని కోరారు. సమ్మిట్లో నిర్వహించే రక్షణ ఎక్స్పో–2026ను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలతో పాటు త్రివిధ దళాల ఆధునిక రక్షణ వ్యవస్థలను ఎక్స్పోలో ప్రదర్శించనున్నట్లు వివరించారు.



