గురుకులంలో 16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య!

రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్లోని గురుకుల కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి వసతి గృహంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తన చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆ బాలిక ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం చింతపల్లి గ్రామానికి చెందినది. ఆమె మరణానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇంత చిన్న వయసులో ఇలా ఎందుకు జరిగింది? ఇది మానసిక ఒత్తిడా.. లేక వేరే కారణమా? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.



