← Back to news

గురుకులంలో 16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య!

By Adithya· 2d ago
గురుకులంలో 16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య!

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌లోని గురుకుల కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి వసతి గృహంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆ బాలిక ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం చింతపల్లి గ్రామానికి చెందినది. ఆమె మరణానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇంత చిన్న వయసులో ఇలా ఎందుకు జరిగింది? ఇది మానసిక ఒత్తిడా.. లేక వేరే కారణమా? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.