రాఘవేంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన న్యాయమూర్తి

జోగులాంబ గద్వాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి గద్వాల్ భీమ్నగర్లోని రాఘవేంద్రస్వామి దేవాలయం సందర్శించి పూజలు నిర్వహించారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాల సందర్భంగా ఉత్తరారాధన పురస్కరించుకొని న్యాయమూర్తి దేవాలయం సందర్శించుకున్నారు. కార్యక్రమంలో మన్నూరు ప్రహ్లాద చారి ప్రమోద్ ప్రసన్న, సీనియర్ న్యాయవాది భీమ్సేనరావు పాల్గొన్నారు.



