← Back to news

రాఘవేంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన న్యాయమూర్తి

By ARJUN· 4d ago
రాఘవేంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన న్యాయమూర్తి

జోగులాంబ గద్వాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి గద్వాల్ భీమ్‌నగర్‌లోని రాఘవేంద్రస్వామి దేవాలయం సందర్శించి పూజలు నిర్వహించారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాల సందర్భంగా ఉత్తరారాధన పురస్కరించుకొని న్యాయమూర్తి దేవాలయం సందర్శించుకున్నారు. కార్యక్రమంలో మన్నూరు ప్రహ్లాద చారి ప్రమోద్ ప్రసన్న, సీనియర్ న్యాయవాది భీమ్‌సేనరావు పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· just now

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.