జడ్చర్లలో ఘోర ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
TG: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని నాగసాల గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నాగసాల నుంచి జడ్చర్లకు బైక్పై వస్తున్న ఇద్దరు కూలీలను కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బస్సు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు.



