← Back to news

గ్రాండ్‌గా బ్రహ్మోత్సవాలు.. CM పట్టు వస్త్రాలు సమర్పణ

By Bala· 4h ago· AP
గ్రాండ్‌గా బ్రహ్మోత్సవాలు.. CM పట్టు వస్త్రాలు సమర్పణ

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇవాళ సాయంత్రం ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రాత్రి 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 9 రోజుల పాటు 16 వాహన సేవల్లో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

More in AP