ఫార్మా కెమికల్స్తో చెరువులో చేపల మృతి🐟

సిద్ధిపేట జిల్లా కర్కపట్ల ఫార్మా కంపెనీల కెమికల్ వాటర్ వల్ల లక్ష్మాపూర్ పెద్ద చెరువులో చేపలు చనిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, వాటర్ శాంపిల్స్ తీసినా సొల్యూషన్ చూపలేదని అంటున్నారు. హెల్త్, భూగర్భ జలాలు, పంటలు పాడైపోతున్నాయని.. వెంటనే అధికారులు ఎంక్వైరీ జరిపి కాలుష్యానికి కారణమైన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.





