అంతా ఆంధ్ర పెత్తనమే నడుస్తోంది: కల్వకుంట్ల కవిత
TG: తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర పెత్తనమే నడుస్తోందని, దీనిపై సీఎం రేవంత్రెడ్డి అసలేమీ మాట్లాడరని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. యాదాద్రి దేవస్థానం బోర్డులో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ నటుడి భార్యకు స్థానం కల్పించడమేంటని ప్రశ్నించారు. బీజేపీ సీఎం విదేశీ పర్యటనను అడ్డుకున్నప్పుడు మాత్రమే ఆయనకు తెలంగాణవాదం గుర్తొచ్చిందా అని మండిపడ్డారు. రాష్ట్రంలో తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతున్నా సీఎం నోరు మెదపడం లేదని అన్నారు.



