ఆసుపత్రికి వెళ్తుండగా అంబులెన్స్లోనే ప్రసవం

TG: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తండాకు చెందిన కొమురె అనసూయకు పురిటి నొప్పులు రావడంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అంబులెన్స్లో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్లోనే అనసూయ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 108 ఈఎంటీ మునీందర్ గౌడ్, పైలెట్ మహేందర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవాన్ని సురక్షితంగా నిర్వహించారు. అనంతరం తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.



