నూతన పంచాయతీ భవనానికి భూమిపూజ

AP: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీకారం చుట్టారు. గ్రామ పరిపాలనకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి రానుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నూతన పంచాయతీ భవనం పూర్తయితే ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయని నాయకులు తెలిపారు.



