← Back to news

ప్రజల కోసం పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డి

By Mohammed Hafeez· 22 Aug 2026
ప్రజల కోసం పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డి

మాజీ పార్లమెంటు సభ్యులు, సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్థంతి సభలు రాష్ర్ట వ్యాప్తంగా జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన పోరాటాలను నాయకులు గుర్తుచేసుకున్నారు. పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం సురవరం సుధాకర్ రెడ్డి జీవితాంతం చేసిన సేవలను కొనియాడారు. ప్రజా ఉద్యమాల బలోపేతానికి, సామాజిక న్యాయ సాధనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ప్రజల కోసం పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డి

More in Local