ప్రకృతి వ్యవసాయం కోసం బయల్దేరిన బస్సు!
అనపర్తిలో సోమవారం ఓ ప్రత్యేక బస్సు బయలుదేరింది. MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులో 110 మంది రైతులు ఉన్నారు. వీళ్లంతా మార్టేరు పరిశోధనా కేంద్రానికి వెళ్తున్నారు. రసాయనాల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం పెంచడం ఈ యాత్ర ఉద్దేశ్యం. మార్టేరులో కొత్త వరి వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులు అభివృద్ధి చేశారు. వాటిని రైతులు ప్రత్యక్షంగా చూడాలని ఈ యాత్ర ఏర్పాటు చేశారు. "ఇంతకాలం రసాయనాల ఆధారంగా సాగు చేశాం. ఇప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటూ.. అధిక దిగుబడులు సాధించాల''ని MLA చెప్పారు.



