← Back to news

ప్రకృతి వ్యవసాయం కోసం బయల్దేరిన బస్సు!

By .· 4d ago· Anaparthy, Anaparthi, East Godavari

అనపర్తిలో సోమవారం ఓ ప్రత్యేక బస్సు బయలుదేరింది. MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులో 110 మంది రైతులు ఉన్నారు. వీళ్లంతా మార్టేరు పరిశోధనా కేంద్రానికి వెళ్తున్నారు. రసాయనాల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం పెంచడం ఈ యాత్ర ఉద్దేశ్యం. మార్టేరులో కొత్త వరి వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులు అభివృద్ధి చేశారు. వాటిని రైతులు ప్రత్యక్షంగా చూడాలని ఈ యాత్ర ఏర్పాటు చేశారు. "ఇంతకాలం రసాయనాల ఆధారంగా సాగు చేశాం. ఇప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటూ.. అధిక దిగుబడులు సాధించాల''ని MLA చెప్పారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.