← Back to news

అసెంబ్లీ హౌస్‌కీపింగ్ వర్కర్స్ నిరసన

By epuri rajaratnam· 22 Aug 2026· AP

AP : అమరావతి మల్కాపురం సెంటర్‌లో అసెంబ్లీ, సచివాలయం హౌస్‌కీపింగ్ టీమ్స్ తమ జీతాలు పెంచాలని నిరసన చేపట్టాయి. 2019 తర్వాత నుంచి ఇప్పటివరకు జీతాలు పెరగలేదని, భారీగా పెరిగిన ఖర్చులు, ఇంటి అద్దెలతో సర్దుకుపోవడం కష్టంగా మారిందని కార్మికులు తెలిపారు. మున్సిపల్ పారిశుద్ధ్య వర్కర్లకి నెలకి రూ. 21,000 ఇస్తుంటే, తమకు మాత్రం రూ. 10,470 మాత్రమే ఇస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా జీతాలు పెంచకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఎక్కువ చేస్తామని చెప్పారు.

More in Local